పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడైనా న్యాయం చేయరూ..!: సీఎం రేవంత్ రెడ్డికి డీఎస్సీ 2008 అభ్యర్థుల విజ్ఞప్తి
- జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి భారీగా చేరుకున్న అభ్యర్థులు
- సీఎం అందుబాటులో లేకపోవడంతో పీఎస్ ను కలిసి వినతిపత్రం అందజేత
- అప్పటి ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపణ
అనంతరం పలువురు అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్ లో తాము అర్హత సాధించామని చెప్పారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై పదిహేనేళ్లుగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని, ఆరు వారాల్లో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తమపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.