మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన
- ఈ నెల 21 నుంచి 24 వరకు నడవనున్న ప్రత్యేక రైళ్లు
- స్పెషల్ ట్రైన్స్తో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు ఇస్తోందని వెల్లడి
- సిర్పూర్ కాగజ్నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్ - సికింద్రాబాద్ - వరంగల్, నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
07017/07018: సిర్పూర్ కాగజ్నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్నగర్, 07014/07015: వరంగల్ - సికింద్రాబాద్ - వరంగల్, 07019/0720: నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరుతో పాటు పలు కీలకమైన స్టేషన్లలో ఆగనున్నాయి. కాగా తెలంగాణలోని ములుగు జిల్లా పరిధిలో వన దేవతలు సమ్మక్క సారక్కల జాతర జరుగుతుంది. పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు ఉపయోగపడనున్నాయి.