అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు ఎందుకు? మీడియా పాయింట్ వద్ద మాట్లాడనివ్వరా?: హరీశ్ రావు
- శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
- మీడియా పాయింట్ వద్దకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు, మార్షల్స్
- పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం
- సభ జరుగుతున్నప్పుడు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణ
- ఇప్పుడు మీడియా పాయింట్ వద్దకు కూడా వెళ్లనీయరా? అని ఆగ్రహం
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనూ... ఇక్కడా... రెండు చోట్ల గొంతు నొక్కుతారా? అని ధ్వజమెత్తారు. ఇక్కడ మూడు నాలుగు వేల మంది పోలీసులను మోహరించారన్నారు. ఇనుప కంచెలను తీసేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని... అలాంటప్పుడు ఇక్కడ ఆంక్షలు ఎందుకో చెప్పాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా? లేక కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో అన్నారు.