Sikkim: మేళాలో దారుణం.. కార్లను ఢీకొన్న మిల్క్ ట్యాంకర్!

3 dead 20 injured as milk truck rams into multiple cars at Sikkim fair
  • రాణీపూల్‌లో ఏర్పాటు చేసిన మేళాలో దారుణం
  • బ్రేకులు ఫెయిలవడంతో కార్లను ఢీకొట్టిన మిల్క్ ట్యాంకర్
  • ముగ్గురి మృతి, 20 మందికి గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
సిక్కింలోని రాణీపూల్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ మేళాలో ఉన్న కార్లను ఓ మిల్క్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాల కింద పడి ముగ్గురు మృతి చెందగా 20 మంది గాయాలపాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిల్క్ ట్యాంకర్ రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలిసింది.
Sikkim
Milk Tanker
Road Accident

More Telugu News