Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య!

  • పేట్‌బషీరాబాద్ ప్రాంతంలో ఘటన
  • మైసమ్మగూడలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి
  • ఉద్యోగ ప్రయత్నాల్లో తరచూ విఫలమవుతూ చివరకు బలవన్మరణం
  • మృతుడు వనపర్తి జిల్లా వాస్తవ్యుడని చెప్పిన పోలీసులు
Engineering student in Hyderabad ends life after not getting job

ఉద్యోగ ప్రయత్నాల్లో తరచూ విఫలమవుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పేట్‌బషీరాబాద్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఎం.డి.మహ్మద్ (22) మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీ 4వ సంవత్సరం చదువుతూ స్థానికంగా ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. అతడు కొంతకాలంగా ప్లేస్‌మెంట్స్‌ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో తనకు ఉద్యోగం వచ్చేలా లేదని స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. 

బుధవారం కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లలో మహ్మద్ ఎంపిక కాలేదు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. స్నేహితులు గదిలో లేని సమయంలో ఉరేసుకున్నాడు. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చిన స్నేహితులు..మహ్మద్ బలవన్మరణానికి పాల్పడ్డ విషయాన్ని గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

More Telugu News