Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై టాస్ నెగ్గిన భారత్

India won the toss against South Africa in Under 19 world cup semis
  • నేడు అండర్-19 వరల్డ్ కప్ లో తొలి సెమీస్
  • బెనోనీ నగరంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో నేడు తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్, ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. బెనోనీ నగరంలోని విల్లోమోర్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. ఈ సెమీస్ సమరంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఏ దశలోనూ ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన భారత కుర్రాళ్ల జట్టు ఈ మ్యాచ్ లోనూ నెగ్గి ఫైనల్ చేరాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. 

అయితే, సొంతగడ్డపై ఆడుతున్న దక్షిణాఫ్రికా యువ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక, ఎల్లుండి (ఫిబ్రవరి 8) జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేటి సెమీస్ లో భారత్ గెలిచి, ఎల్లుండి పాకిస్థాన్ కూడా నెగ్గాలని... దాంతో, దాయాదుల మధ్య ఫైనల్ సమరం జరిగితే చూడాలని ఇరుదేశాల క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News