షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్
- మహిళలను అవమానించడం నీచం అంటూ మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ
- షర్మిల, వైఎస్ సునీతపై సోషల్ మీడియాలో దాడిని ఖండించిన రాహుల్
- వారికి కాంగ్రెస్ పార్టీతో పాటు తాను అండగా ఉంటానని వెల్లడి
మహిళలను కించపరచడం, బెదిరించడం పిరికిపందల చర్య అని, దురదృష్టవశాత్తూ శక్తిహీనులకు ఇదొక ఆయుధంగా మారిందని రాహుల్ గాంధీ చెప్పారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా అండగా నిలబడతానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.