నిస్సందేహంగా అద్వానీ భారతరత్నకు అర్హులు: చిరంజీవి స్పందన
- మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరు అని ప్రశంస
- అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనదన్న చిరంజీవి
- రాజకీయాల యొక్క... రాజకీయ నాయకుల యొక్క స్థాయిని, గౌరవాన్ని పెంచారని వ్యాఖ్య
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ భారతరత్నకు ఎంపికైన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయనను గౌరవించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రధాని శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీంతో అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.