LK Advani: అద్వానీకి భారతరత్న రావడంపై కూతురు ప్రతిభా అద్వానీ స్పందన

  • తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్న ప్రతిభా అద్వానీ
  • అద్వానీ తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారని వ్యాఖ్య
  • తండ్రికి మిఠాయి తినిపించిన కూతురు
Daughter hugs her father after govt decision to confer him Bharat Ratna

కేంద్ర ప్రభుత్వం తనకు భారతరత్న ప్రకటించిన తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తొలిసారి బయటకు వచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభా అద్వానీ మాట్లాడుతూ... తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం లభించడం కుటుంబానికి ఆనందంగా ఉందన్నారు. అద్వానీ తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారన్నారు. అద్వానీకి ఈ పురస్కారం అందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న రావడంపై తన తండ్రి కూడా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 

అద్వానీకి భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత, తన కుమార్తె ప్రతిభా అద్వానీతో కలిసి ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభా అద్వానీ తన తండ్రికి మిఠాయి తినిపించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయంతో సంతోషంగా ఉన్న ప్రతిభా అద్వానీ తండ్రిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

More Telugu News