రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు... మండిపడిన మల్లు రవి
- రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్ రావులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి
- సీఎంపై ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు తిరగబడతారని హెచ్చరిక
- రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే ప్రజలను అవమానించడమేనన్న కాంగ్రెస్ నేత
ఓ ముఖ్యమంత్రి పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారన్నారు. పైగా ముఖ్యమంత్రికి హుందాతనం లేదని హరీశ్ రావు మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రజాపాలన అందిస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని... బీఆర్ఎస్ నేతలు తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.