Daggubati Purandeswari: ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి

  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • సన్నాహాలు షురూ చేసిన రాష్ట్ర బీజేపీ
  • 25 జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజన
  • ఐదు క్లస్టర్లకు ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిల నియామకం
  • 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంయోజకులు, ప్రభారీల నియామకం
Purandeswari made AP BJP organisational appointments

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దృష్టి సారించారు. ఇవాళ క్లస్టర్ ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిలు, లోక్ సభ స్థానాలు సంయోజకులు, ప్రభారీలను ప్రకటించారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని పురందేశ్వరి పేర్కొన్నారు. 25 జిల్లాలను ఐదు క్లస్టర్లు చేసి వాటికి ఇన్చార్జిలను, సహ ఇన్చార్జిలను నియమించారు. అదే సమయంలో 25 పార్లమెంటు స్థానాలకు సంయోజకులను, ప్రభారీలను నియమించారు.

More Telugu News