మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్న సీతారామన్
- మొరార్జీ దేశాయ్తో సమంగా ఆరవసారి సమర్పణకు సిద్ధమైన ఆర్థికమంత్రి
- ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం
కాగా మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959 - 1964 మధ్య కాలంలో 5 వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాగా 2024-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్ను సీతారామన్ సమర్పించనున్నారు. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వ వ్యయాల కోసం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన ప్రకటనలు ఉండవు. అత్యవసర ఆర్థిక సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాక జూన్ లేదా జులై నెలలో 2024-25 పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడతారు.