metro: మెట్రో రైలు ఫేజ్-2 పనులపై స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  • రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో రైలు భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
  • ఫేజ్-2కు సంబంధించి ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడి
  • రెండో ఫేజ్ మెట్రో విస్తరణ ద్వారా అన్ని ప్రాంతాలకు సేవలు
NVS Reddy on Metro rail project phase 2

మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ డెబ్బై కిలో మీటర్ల మేర ఫేజ్-2 విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో రైలు భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మెట్రో ఫేజ్-2కు సంబంధించి ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. రెండో ఫేజ్ మెట్రో విస్తరణ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు సేవలు అందుతాయని తెలిపారు.

More Telugu News