ఉదయం నుంచి 3 లక్షల మంది భక్తులకు బాలరాముడి దర్శనం
- రామమందిరం వద్ద 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది
- నేడు తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకున్న రామాలయం
- 7 గంటల నుంచి భక్తులకు అనుమతి
- బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న మరో 3 లక్షలమంది భక్తులు
నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో బాలరాముడిని చూసేందుకు భక్తులు వరుస కడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకే రాములోరి గుడి తెరుచుకుంది. 7 గంటల నుంచి భక్తులను అనుమతించారు. ఉదయం 2.5 నుంచి 3 లక్షల మంది దర్శించుకోగా... మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచి చూస్తున్నారు.