లోక్ సభ ఎన్నికల్లో మేం ఒంటరిగానే పోటీ చేస్తాం: మాయావతి
- ఎన్నికల తర్వాత పొత్తులను తోసిపుచ్చిన మాయావతి
- పొత్తులతో వెళ్లిన ప్రతిసారీ తామే నష్టపోతున్నామన్న మాయావతి
- రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మస్లింల మద్దతుతో ఉత్తరప్రదేశ్ లో తాము 2007లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. కులతత్వం, మతతత్వ పార్టీలకు తాము దూరంగా ఉంటామన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను తన వారసుడిగా గత వారం ప్రకటించానని... అయితే ఈ ప్రకటన తర్వాత తాను రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారం సాగుతోందని... కానీ అందులో వాస్తవం లేదన్నారు.