మందడంలో భోగి వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో వేడుకలు
- సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు, పవన్
- ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు
- భోగి మంటలు వెలిగించి వేడుకలు ప్రారంభించిన నేతలు
మందడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్కు టీడీపీ, జనసేన కార్యకర్తలతోపాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేతలు ఇద్దరూ కలిసి భోగిమంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు.