Ram Nath Kovind: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

  • రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ రెడ్డి
  • పుష్పగుచ్ఛం ఇచ్చి.. వీణను బహూకరించిన సీఎం
  • వివిధ అంశాలపై చర్చించిన కోవింద్-రేవంత్ రెడ్డి
CM Revanth Reddy meets Ramnath Kovind

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. వీణను బహూకరించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా , జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.

More Telugu News