Vellampalli Srinivasa Rao: వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరు వర్గాలు ఉండవు: వెల్లంపల్లి శ్రీనివాస్

  • నియోజకవర్గం మారాలంటే బాధగానే ఉంటుందన్న వెల్లంపల్లి
  • పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య
  • ఏ పార్టీలో చేరాలనేది షర్మిల ఇష్టమన్న వెల్లంపల్లి
Vellampalli Srinivas comments on YS Sharmila

తాము గేట్లు తెరిస్తే వైసీపీలో ఉన్న వాళ్లంతా టీడీపీలోకి వస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని... మరి ఇంతవరకు ఆయన గేట్లు ఎందుకు తెరవలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గాన్ని విజయవాడ సెంట్రల్ కు మార్చడంపై స్పందిస్తూ... నియోజకవర్గం మారాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందని... కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ లో వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ లో మైనార్టీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, అందుకే తనను సెంట్రల్ కు మార్చారని చెప్పారు. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరు వర్గాలు ఉండవని... అంతా వైసీపీ వర్గమేనని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది వైఎస్ షర్మిల ఇష్టమని... ఆమె ఏం మాట్లాడతారో వేచి చూడాల్సి ఉందని అన్నారు.

More Telugu News