మల్లు భట్టి విక్రమార్కను సన్మానించిన ఓయూ విద్యార్థులు
- ఓయూ జేఏసీ చైర్మన్ లోకేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లు భట్టిని కలిసిన విద్యార్థులు
- నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. కేక్ కట్ చేయించిన విద్యార్థులు
- కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మల్లు భట్టి కీలక పాత్ర పోషించారని వ్యాఖ్య
ఈ సందర్భంగా లోకేశ్ యాదవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అక్రమాలను, అన్యాయాలను ఎండగడుతూ మల్లు భట్టి విక్రమార్క 1365 కిలో మీటర్ల పాదయాత్ర చేశారని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మల్లు భట్టి పాదయాత్ర ఎంతో దోహదపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్రను పోషించిన మల్లు భట్టిని తాము సన్మానించామని తెలిపారు.