Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకలు.. నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్

  • నేటి అర్ధరాత్రి వరకూ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్న సంస్థ ఎండీ 
  • చివరి రైలు అర్ధరాత్రి 12.15 గంటలకు టర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతుందని వెల్లడి
  • ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచన
Hyderabad Metro to run services till midnight today new year

నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న నగరవాసులకు హైదరాబాద్ మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి అర్ధరాత్రి వరకూ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. చివరి సర్వీసులు టర్మినల్ స్టేషన్‌ల నుంచి అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరి గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో ఎండీ తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్టు చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్‌లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో స్టేషన్‌లోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News