ఏపీ మీదుగా ప్రయాణించనున్న అమృత్‌ భారత్‌ రైలు

Amrit Bharat train will travel through Andhrapradesh
  • తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్న మాల్టా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం లాంఛనంగా ప్రారంభం కానున్న సరికొత్త రైలు
  • అత్యాధునిక సౌకర్యాలతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
ఇండియన్ రైల్వేస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్టా - కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య నడిచే రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా వెళ్లనుంది. శనివారం నుంచి పట్టాలెక్కనున్న మాల్దా - బెంగళూరు అమృత్‌ భారత్‌ ఎక్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అమృత్ భారత్ రైలు వలస కార్మికులకు మరింత ప్రయోజనకారిగా ఉండనుంది. ఇందులో 12 స్లీపర్‌ తరగతి, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి. వందేభారత్ తరహాలో మరింత డైనమిక్‌గా దీనిని డిజైన్ చేశారు. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు అధునాతన సౌకర్యాలు కల్పించారు.
Go Back to Shorts
Amrit Bharat train
Amrit Bharat express
Andhrapradesh
Indian Railways
Narendra Modi

More Telugu News