మధ్య నైజీరియాలో మరో నరమేధం.. సాయుధ మూకల కాల్పుల్లో 160 మంది మృతి
- కొన్ని తెగల ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులతో విరుచుకుపడ్డ సాయుధ మూకలు
- ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కొనసాగిన దాడులు
- ఇళ్లలోకి దూరి ప్రజలను చిత్రహింసలకు గురి చేసి నరమేధం సృష్టించిన సాయుధ సమూహాలు
ఇదిలావుంచితే కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా మధ్య నైజీరియా కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతోంది. సామాజిక పరమైన, మతపరమైన విబేధాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.