మహ్మద్ షమీకి అర్జున అవార్డ్.. సాత్విక్-చిరాక్ జోడీకి ఖేల్రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
- 2023 ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక
- జనవరి 9, 2024న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న క్రీడాకారులు
అర్జున అవార్డు అందుకోనున్న ఆటగాళ్ల జాబితా..
మహ్మద్ షమి (క్రికెట్), అనూష్ అగర్వాలా (ఈక్వస్ట్రియన్), దివ్యకృతి సింగ్(ఈక్వస్ట్రియన్ డ్రస్సెజ్), దీక్షా దాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్ (హకీ), ఓజస్ ప్రవీణ్ (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి (చెస్), సుశీల చాను (హకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రితూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో ఖో), పింకీ (లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వు షూ), శీతల్ దేవి (పారా ఆర్చరీ), అజయ్రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్లను కేంద్రం ప్రకటించింది. కాగా ఈ అవార్డులను క్రీడాకారులను జనవరి 9, 2024న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.