Free Bus: మాకు ఉచితం వద్దు.. టికెట్ తీసుకునే వెళ్తాం.. ఖమ్మం మహిళా టీచర్ల తీర్మానం

We dont want free bus service buy ticket and travel says Khammam teachers
  • ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ల నిర్ణయం
  • ఉచిత సౌకర్యాన్ని పేదలు, వృద్ధులకు, కాలేజీ పిల్లలకు వదిలేయాలని నిర్ణయం
  • టీచర్ల నిర్ణయంపై ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణాన్ని తాము ఉపయోగించుకోబోమని, తాము టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకుంటే చాలని, అది వారికి అవసరం కూడా అని వారు పేర్కొన్నారు. తమకు టికెట్ తీసుకుని ప్రయాణంచేంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ మేరకు అందరూ కలిసి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు.


ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఈ మేరకు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని కాలేజీ విద్యార్థులు, పేదలు, వృద్ధులకు వదిలేయాలని నిర్ణయించారు. తమ నిర్ణయం వల్ల ఆర్టీసీకి అండగా ఉన్నామన్న తృప్తితోపాటు ఆటో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, బస్సుల్లో వీరికి డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తారా? లేదా? అన్న అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News