తప్పు చేస్తే నా కొడుకును ఉరితీయండి.. పార్లమెంటులో కలకలం సృష్టించిన నిందితుడి తండ్రి
- కొడుకు తప్పు చేస్తే ఖండిస్తానన్న మనోరంజన్ తండ్రి దేవరాజ్
- సమాజానికి హాని కలిగించడం సరికాదని ఖండన
- లోక్సభలో భద్రతా వైఫల్య ఘటనపై స్పందన
కాగా బుధవారం మధ్యాహ్నం లోక్సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న సాగర్ శర్మ, మనోరంజన్ ఛాంబర్లోకి దూకి కలకలం రేపారు. పసుపు రంగు పొగని వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశారు. ఎంపీలు కూర్చునే బెంచీల మీద నుంచి దూకుతూ స్పీకర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.