రేపటి నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా సుదీర్ఘ పర్యటన
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆసక్తికర సమరం
- మూడు టీ20లు, మూడు వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న టీమిండియా
- రేపు డర్బన్ లో తొలి టీ20
భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. టెస్టుల్లో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఈ సుదీర్ఘ పర్యటన టీ20 సిరీస్ తో ప్రారంభం అవుతోంది. రేపు (డిసెంబరు 10) డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి.
తొలి టీ20- డిసెంబరు 10 (డర్బన్)
రెండో టీ20- డిసెంబరు 12 (కెబెరా)
మూడో టీ20- డిసెంబరు 14 (జొహాన్నెస్ బర్గ్)
తొలి వన్డే- డిసెంబరు 17 (జొహాన్నెస్ బర్గ్)
రెండో వన్డే- డిసెంబరు 19 (కెబెరా)
మూడో వన్డే- డిసెంబరు 21 (పార్ల్)
తొలి టెస్టు- డిసెంబరు 26 నుంచి 30 వరకు (సెంచురియన్)
రెండో టెస్టు- జనవరి 3 నుంచి 7 వరకు (కేప్ టౌన్)