సీఎం రేవంత్ నుంచి ఫస్ట్ ఉచిత బస్సు ప్రయాణం టిక్కెట్ పొందిన జర్నలిస్ట్ ఉమా సుధీర్
- ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- తెలంగాణ సీఎంవో నుంచి టిక్కెట్ పొందినట్లు ట్వీట్
- ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే హామీని అమలు చేశారంటూ కితాబు
ఇందుకు సంబంధించి ఉమా సుధీర్ తాను తొలి జీరో టిక్కెట్ పొందినట్లు (ఉచిత ప్రయాణ టిక్కెట్) ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంవో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నుంచి ఉచిత టిక్కెట్ను పొందినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే ఈ హామీని నెరవేర్చిందని, రోజుకు రూ.6 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు.