BRSLP: బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్

  • కేశవరావు అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్
  • తెలంగాణ భవన్ లో భేటీ అయిన 37 మంది ఎమ్మెల్యేలు
  • శస్త్ర చికిత్స కారణంగా మీటింగ్ కు రాలేకపోయిన కేసీఆర్
  • ఎమ్మెల్యే కేటీఆర్ కూడా గైర్హాజరు
KCR Is Elected As BRSLP Leader

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో తమ లీడర్ గా కేసీఆర్ ను ఎన్నుకుంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

More Telugu News