Pawan Kalyan: విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్... కాసేపట్లో జనసేన బహిరంగ సభ

Pawan Kalyan arrives Vizag to attend Janasena rally
  • విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన సభ
  • హాజరు కానున్న పవన్ కల్యాణ్
  • జనసేన పార్టీలో చేరనున్న ప్రముఖ కాంట్రాక్టర్ వెంకట సతీశ్ కుమార్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనకు జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన పార్టీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుందరపు వెంకట సతీశ్ కుమార్ ఈ సభలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, విశాఖ నగరం, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నేతలు కూడా హాజరవుతారు.

  • Loading...

More Telugu News