రేవంత్ రెడ్డికి భద్రత పెంపు
- కొడంగల్, కామారెడ్డి.. రెండుచోట్లా దూసుకెళుతున్న రేవంత్ రెడ్డి
- ఫలితాల ట్రెండ్ తో పీసీసీ చీఫ్ ఇంటి చుట్టూ ట్రాఫిక్ పోలీసులు
- ఆయన నివాసానికి క్యూ కడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద శనివారం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అనుచరులు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు భద్రత మరింత పెంచారు.