సీఎం జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ
- సీఎం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు
- 127 డిశ్చార్జి పిటిషన్లపై ఓ కొలిక్కి వచ్చిన వాదనలు
- లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించాలన్న న్యాయస్థానం
- తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా
కాగా, ఇవాళ్టి విచారణలో సీఎం జగన్ తదితరులకు సంబంధించిన 127 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అంతేకాదు, నిందితులపై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఈడీ దాఖలు చేసిన 8 చార్జిషీట్లపై నిందితుల పిటిషన్లపై విచారణ కూడా ఓ కొలిక్కి వచ్చింది. సీఎం జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.