election commission: తెలంగాణలో ముగిసిన ప్రచారం... 144వ సెక్షన్ అమల్లోకి వచ్చిందన్న సీపీ సందీప్ శాండిల్య

144 section in Hyderabad till 30 november
  • 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడి
  • కల్లు, మద్యం దుకాణాలు మూసివేయాలన్న సందీప్ శాండిల్య
  • ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడదని స్పష్టీకరణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144వ సెక్షన్ అమలులోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య చెప్పారు. నేటి సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించారు. కల్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని తెలిపారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు. పోలింగ్ ముగిసేవరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News