DK Shivakumar: తెలంగాణలో కోడ్ ఉల్లంఘించామా... ఎక్కడ?: ఈసీ నోటీసులపై డీకే శివకుమార్ స్పందన

DK Shivakumar reacts to EC notice
  • తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్ లు
  • నోటీసులు జారీ చేసిన ఈసీ
  • తమ ప్రకటనల్లో ఎక్కడా ఓట్లు అడగలేదన్న శివకుమార్
  • నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టీకరణ

తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక సర్కారు ఇస్తున్న ప్రకటనలపై ఈసీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. తాము ఎక్కడా కోడ్ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. తమ ప్రకటనల్లో ఎక్కడా ఓట్లు అడగలేదని వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ఆ ప్రకటనల్లో పేర్కొన్నామని వెల్లడించారు. తాము గెలిచాక హామీలు అమలు చేయడంలేదంటున్న విపక్షాలకు ఆ వాణిజ్య ప్రకటనల ద్వారా బదులిచ్చాం... ఇక మేం నిబంధనలు ఉల్లంఘించింది ఎక్కడ? అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News