గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే మీరు నా శవయాత్రకు రండి: బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Huzurabad BRS Koushik Reddy hot comments
  • హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి
  • ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యలు
  • ఇక ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్య
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోవాలని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'మీరు ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాలా? ఇక మీ ఇష్టం. ఏం చేస్తారో మీ ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలను మీరు చూడాలి. మెజార్టీ ఇస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే నాలుగో తేదీన శవయాత్రకు మీరు రండి' అన్నారు.
Go Back to Shorts
koushik reddy
BRS
Telangana Assembly Election
BJP

More Telugu News