Bigg Boss: ప్రియాంకకి కోపం ఎక్కువ .. శివాజీ నన్ను పట్టించుకోలేదు:'బిగ్ బాస్' అశ్వని

  • బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అశ్వని
  • హౌస్ లో రెండు గ్రూపులు ఉన్నాయని వ్యాఖ్య 
  • గౌతమ్ సోలోగా ఆడుతున్నాడని వెల్లడి 
  • ప్రియాంక నోరేసుకుని పడిపోతుందన్న అశ్వని

Bigg Boss 7 Update

బిగ్ బాస్ హౌస్ లో నుంచి నిన్న అశ్వని బయటికి వచ్చింది. హౌస్ మేట్స్ లో నామినేషన్స్ సమయంలో, ఎవరినీ నామినేట్ చేయడానికి ఏ రీజన్ లేదంటూ, తాను సెల్ఫ్ నామినేట్ అయింది. ఆ కారణంగా ఆమె బయటికి రావలసి వచ్చింది. స్టేజ్ పై నాగ్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆమె హౌస్ మేట్స్ గురించి ప్రస్తావించింది. 

హౌస్  రెండు గ్రూపులుగా విడిపోయిందనీ,  శోభ .. ప్రియాంక .. అమర్ ఒక గ్రూప్. శివాజీ .. ప్రశాంత్ .. రతిక ఒక గ్రూప్ గా ఉన్నారని అంది. గౌతమ్ సోలోగా ఆడుతున్నాడని చెప్పిన ఆమె, అర్జున్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రియాంక మంచిదేగానీ .. కోపం .. తొందరపాటు ఎక్కువనీ, గట్టిగా అరిచేస్తుందనీ ... ఆ పద్ధతిని మార్చుకోవాలని సూచించింది. 

"శివాజీ తనతో సరిగ్గా మాట్లాడలేదనీ .. తనని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాన్ని అశ్వని వ్యక్తం చేసింది. అయితే అలా ఆమెను వేరుగా తాను ఎప్పుడూ చూడలేదనీ, హౌస్ లో అందరితోను తాను కలుపుగోలుగానే ఉన్నాననీ .. అయితే కొన్ని సందర్భాలలో ఆమెకి అలా అనిపించి ఉండొచ్చునని శివాజీ అన్నాడు. 

More Telugu News