ఐపీఎల్ 2024 వేలానికి ముందు కీలక బౌలర్ను వదులుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- పృథ్వీ షాని రిటెయిన్ చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- ఐపీఎల్ 2024 నాటికి సిద్ధంగా ఉంటాడని భావిస్తున్న డీసీ యాజమాన్యం
- వేలానికి సమయం ఆసన్నమవుతుండడంతో నిర్ణయం
అంతగా రాణించలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండేలను ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే వదులుకుంది. అయితే టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీలు పృథ్వీ షా సామర్థ్యాలపై నమ్మకం ఉంచారు. ఈ కారణంగా అతడిని జట్టు రిటెయిన్ చేసుకుంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి షా ఫిట్గా ఉంటాడని టీమ్ అంచనా వేస్తోంది.
ఇక శార్ధూల్ ఠాకూర్ విషయానికి వస్తే ఈ మధ్య ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లోకి రావడంతో శార్దూల్ ప్రాధాన్యత మరింత తగ్గిపోవడం మరో కారణంగా ఉంది. బౌలింగ్ లేదా బ్యాటింగ్ టాప్ 6లో చోటు దక్కించుకునే స్థాయిలో ఠాకూర్ రాణించలేకపోతున్నాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఠాకూర్ను వదిలేయడం ద్వారా రూ.10.75 కోట్లు టీమ్ ఖాతాలో అదనంగా ఉంటాయని, రూ.5 కోట్లతో కొత్త టాలెంటెడ్ ప్లేయర్ను దక్కించుకునేందుకు ఈ డబ్బుని వెచ్చించాలని భావిస్తోంది.