ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం: అమిత్ షా
- డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి అన్న అమిత్ షా
- బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్లేనని హెచ్చరిక
- బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసిందని వెల్లడి
- బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఘనత తమ పార్టీదే అన్న అమిత్ షా
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతోందని, కశ్మీర్ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఘనత బీజేపీదే అన్నారు. బీజేపీని గెలిపిస్తే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. కేసీఆర్ వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.