సమైక్యవాదులకు మానుకోట చుక్కలు చూపింది... ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు చూపించండి: హరీశ్ రావు
- సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట తరిమికొట్టిందని గుర్తు చేసిన మంత్రి
- తెలంగాణ మీద దండెత్తడానికి వస్తోన్న ఢిల్లీ పార్టీలకు మానుకోట దమ్ము చూపించాలని వ్యాఖ్య
- కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో మోసం చేశారని విమర్శలు
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారన్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా? బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీల సమావేశాలు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని, బీఆర్ఎస్ సభలు జన సముద్రంలా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ సుపరిపాలన అందిస్తోందని, కాబట్టి ప్రజలు రిస్క్ తీసుకోవద్దని సూచించారు.