ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో గాంధీ భవన్ రిమోట్: అసదుద్దీన్ ఓవైసీ
- కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ గెలుస్తోందని విమర్శలు
- రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్తో ప్రారంభమైందన్న అసదుద్దీన్
- బీజేపీతో తమ పోరాటం సాగుతుందని స్పష్టీకరణ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా... బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన చోట మజ్లిస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామన్నారు. తమ ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు.