ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఒక సీటే గెలుస్తుంది: దుబ్బాకలో హరీశ్ రావు
- అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోందని విమర్శలు
- ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఏ హామీ నెరవేర్చలేదన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ మేనిఫెస్టోను, పాటలను కాపీ కొట్టారన్న మంత్రి
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకొని నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు చేయించారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారని ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు మన మేనిఫెస్టోనే కాపీ కొట్టారని విమర్శించారు. చివరకు కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాటలనే కాపీ చేస్తోందన్నారు.