Kota Bommali: ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు: అల్లు అరవింద్

Kota Bommali PS Prachara Sabha
  • మలయాళంలో హిట్ కొట్టిన 'నాయట్టు'
  • తెలుగు రీమేక్ గా 'కోట బొమ్మాళి పీఎస్'
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
  • ఎలక్షన్స్ సమయంలో రిలీజ్ పట్ల స్పందించిన అల్లు అరవింద్

మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'నాయట్టు' సినిమా, అక్కడ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. చాలా తక్కువ పాత్రలతో .. ఇంట్రెస్టింగ్ గా సాగే కథ ఇది. అలాంటి ఆ సినిమాను గీతా ఆర్ట్స్ 2 వారు, 'కోటబొమ్మాళి పీఎస్' టైటిల్ తో రీమేక్ చేశారు. శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని ప్రధానమైన పాత్రలను పోషించారు. 

ఈ నెల 24వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'ప్రచారసభ'లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "సాధారణంగా దొంగలను పోలీసులు ఛేజ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో పోలీసులను పోలీసులే ఛేజ్ చేస్తుంటారు. ఈ కథలో హీరో .. హీరోయిన్స్ ఉండరు .. పాత్రలు మాత్రమే ఉంటాయి" అని అన్నారు. 

కరెక్టుగా చెప్పాలంటే కథనే హీరో అనుకోవాలి. ఈ కొత్తదనాన్ని తప్పకుండా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది పోలీసులకు .. రాజకీయనాయకులకు మధ్య జరుగుతుంది. ఎవరినీ ఉద్దేశించి ఈ సినిమాను తీయలేదు. పోలీసులను న్యాయం చేయనీయరు. ఆలిండియాలో ఉన్న ఈ వ్యవస్థను ఖండిస్తూ తీసిన సినిమా ఇది. ఎలక్షన్స్ సమయంలో ఈ సినిమా వస్తోంది .. ఆ సందర్భం కుదిరింది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News