అన్ని నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాల ఏర్పాటు: మంత్రి హరీశ్ రావు
- కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి
- గురుకులాల్లో ప్రస్తుతం ఆరు లక్షలమంది చదువుతున్నారన్న హరీశ్ రావు
- గురుకులాల్లో చదివిన వారు 6,652 మంది దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు వెల్లడి
గురుకులాల్లో చదివిన 6,652 మంది ఇప్పుడు దేశ, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలను ఇంటర్ నుంచి డిగ్రీకి అప్ గ్రేడ్ చేస్తామన్నారు. అన్ని వర్గాలు చదువుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఏం జరుగుతుందో తెలియకుండానే మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలు ఆసుపత్రులలో ఉచితంగా మోకాలిచిప్ప ఆపరేషన్లు చేస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే మోకాలిచిప్ప ఆపరేషన్లు చేయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.