Satyavathi Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌పై గూడురు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... ఎందుకంటే..!

  • బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారం కోసం వెళ్లిన సత్యవతి రాథోడ్
  • మంత్రికి హారతి ఇచ్చి స్వాగతం పలికిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు
  • హారతి పళ్లెంలో రూ.4వేలు వేసిన సత్యవతి రాథోడ్
Police case files against minister satyavathi rathode

మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్ జిల్లా గూడురు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారం కోసం ఇటీవల కొంగరగిద్దకు సత్యవతి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ సమయంలో సత్యవతి రాథోడ్ మంగళహారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులిచ్చారని ఎఫ్ఎస్‌టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఫిర్యాదు నేపథ్యంలో గూడురు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

More Telugu News