అత్తారింట్లో తొలి దీపావళి జరుపుకున్న లావణ్య త్రిపాఠి.. ఫొటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్
- ప్రత్యేక దుస్తుల్లో మెరిసిపోయిన నూతన దంపతులు
- కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు
- ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్
ఇక మరో ఫొటోలో నాగబాబు కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా మెరిసిపోతూ కనిపించారు. వరుణ్ తేజ్ దంపతులతోపాటు నాగబాబు, ఆయన భార్య పద్మజ, కూతురు నిహారిక ఫొటోలో కనిపించారు. దీపావళి ప్రత్యేక దుస్తుల్లో కుటుంబ సభ్యులంతా సంతోషంగా కనిపించారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎలప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ ఫ్యాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలావుండగా ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరిగింది. అతిథుల కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వరుణ్ ఇన్స్టా పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.