‘కాస్తన్నా సిగ్గుండాలి’.. పాక్ మాజీ క్రికెటర్పై ఫైరైపోయిన షమీ
- భారత బౌలర్లకు 2 రకాల బాల్స్ అందుతున్నాయన్న పాక్ మాజీ క్రికెటర్ రజా
- రజా ఆరోపణల్ని ఖండించిన వసీం ఆక్రమ్
- రజాపై తాజాగా మండిపడ్డ భారత బౌలర్ మహమ్మద్ షమీ
- ‘మీ క్రీడాకారుడి మాట నమ్మకపోతే ఎలా?’ అంటూ చురక
‘‘ఇలాంటి మాటలు అంటున్నందుకు మీరు సిగ్గుపడాలి. మూర్ఖపు వ్యాఖ్యలు చేసే బదులు ఆటపై దృష్టి పెడితే మంచిది. ఇది ఐసీసీ వరల్డ్ కప్.. మీ దేశంలో జరిగే లోకల్ మ్యాచ్ కాదు. వసీం అంతా వివరించినా కూడా తీరు మారదా? మీ ఆటగాడినే మీరు నమ్మరా?’’ అంటూ షమీ ఇన్స్టాలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు.