Raghu Rama Krishna Raju: ఏఏజీ, సీఐడీ చీఫ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో రఘురామ పిటిషన్

Raghurama files implead petition in AP High Court
షార్ట్స్‌లో చూడండి
అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంపై గతంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణలో వాదనలు వినిపించేందుకు తనకు కూడా అవకాశం కల్పించాలని రఘురామ తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏఏజీ పొన్నవోలు, సీఐడీ చీఫ్ సంజయ్ నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ కేసుపై మీడియా సమావేశాలు నిర్వహించారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Implede Petition
AP High Court
AAG
CID
YSRCP
Andhra Pradesh

More Telugu News