Virat Kohli: 13 ఏళ్ల నాటి కోహ్లీ ట్వీట్ వైరల్.. అభిమానుల్లో సంబరం

  • టీం కోసం పరుగులు చేస్తా అంటూ 2010లో విరాట్ ట్వీట్
  • సచిన్ రికార్డు సమం చేసిన నేపథ్యంలో నాటి ట్వీట్ వైరల్ 
  • మాట నిలబెట్టుకున్నాడంటూ అభిమానుల్లో సంబరం
Virat kohlis old tweet goes viral amid his 49th century

కింగ్ కోహ్లీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అద్భుత క్షణం రానేవచ్చింది. దక్షిణాఫ్రికాతో నిన్నటి వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌‌లో కోహ్లీ 49వ శతకం కొట్టి సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. తన పుట్టినరోజునే ఈ అద్భుతం సాధించి అభిమానుల ఆనందం అంబరాన్ని అంటేలా చేశాడు. దీంతో, టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో పరుగుల యంత్రం కోహ్లీ సుమారు 13 ఏళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌ను నెటిజన్లు తవ్వితీశారు. ‘టీం తరపున బోలెడన్ని పరుగులు చేసేందుకు ఉత్సుకతో ఉన్నా’ అంటూ కోహ్లీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నాటి మాట కెరీర్ ఆసాంతం నిలబెట్టుకుంటూ వస్తున్నాడని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యావత్ దేశ ఆశలు మోస్తున్నా సునాయాసంగా పరుగుల వరద పారించాడంటూ కామెంట్ల వరద పారిస్తున్నారు.

More Telugu News