పార్టీ మారుతున్న విజయశాంతి?
- ఇంతవరకు విజయశాంతికి టికెట్ ను ఇవ్వని బీజేపీ
- విజయశాంతిని కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించినట్టు ప్రచారం
- మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం
మరోవైపు విజయశాంతితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని విజయశాంతిని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలని రేవంత్ కోరారని... పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ టికెట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ లో విజయశాంతి చేరుతున్నారని సమాచారం. ఇదే జరిగితే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్టే.