Australia: వరల్డ్ కప్: సెమీస్ బెర్తుపై కన్నేసిన ఆసీస్... మోదీ స్టేడియంలో ఇంగ్లండ్ తో పోరు

  • వరల్డ్ కప్ లో నేడు డబుల్ హెడర్
  • రెండో మ్యాచ్ లో ఆసీస్ × ఇంగ్లండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
Aussies takes up England

వరల్డ్ కప్ లో నేడు డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడుతుండగా... మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆడుతున్నాయి. ఆసీస్, ఇంగ్లండ్ పోరుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆసీస్ సెమీస్ చాన్సులు మరింత మెరుగవుతాయి. పాయింట్ల పట్టికలో ఆసీస్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ గనుక ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన రెండో జట్టు అవుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

More Telugu News