Chandrababu: మద్యం కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu gets relief in AP High Court in liquor case
  • చంద్రబాబును అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు తెలిపిన ఏజీ
  • మద్యం కేసులో వచ్చే నెల 15న కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ
  • తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసిన హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మద్యం కేసులో కూడా ఆయనకు హైకోర్టు ఊరటను ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ కేసును హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా, చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేయబోమని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇతర కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపారు. స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించబోమని చెప్పారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ స్టేట్మెంట్ ను హైకోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. మద్యం కేసులో వచ్చే నెల 15న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు.
Chandrababu
Telugudesam
Liquor Case
AP High Court

More Telugu News